కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ను యూఏఈకి మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి జేషా ఇవాళ మీడియాతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం భారత్ లో ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నామని, టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకమైందన్నారు. టీ20 వరల్డ్ కప్ ను ఇండియాలో నిర్వహించాలా లేదా అన్న అంశం పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని షా వెల్లడించారు.