నగరంలోని కూకట్ పల్లిలో కాల్పుల కలకలం రేగింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగులు కాల్పులు జరిపారు. సెక్కూరిటీ గార్డ్ తో పాటు ఏటీఎం సిబ్బంది పై కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.