
తెలంగాణ ప్రభుత్వం సెట్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కార్యచరణ రెడీ చేసింది. ఇందుకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. ఆగస్టులో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు పీజీ ఈ సెట్ నిర్వహిస్తారు. ఆగస్టు 19,20 తేదీల్లో ఐసెట్, ఆగస్టు 23వ తేదీన లా సెట్ 24, 25 తేదీల్లో ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.