– భారీగా తరలివచ్చిన భక్తులు
TANA Sri Srinivasa Kalyanam : హిక్స్విల్లే, న్యూయార్క్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి మార్గదర్శకత్వంలో, తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో హిక్స్విల్లేలోని అసామై హిందూ టెంపుల్లో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విశేష భక్త జన సందోహంతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, ఈవెంట్ కోఆర్డినేటర్లు ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి తెలిపారు.

ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సుమారు 500 మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో, పిట్స్బర్గ్ హెడ్ ప్రీస్ట్ శ్రీ వెంకటాచార్యులు, ప్రముఖ వేద పండితులు శ్రీ హనుమంతరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంప్రదాయ పద్ధతిలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి, కోశాధికారి రాజా కసుకుర్తి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ ఫణి కంతేటి, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ నారెపలేపు, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఓరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక, దశరథ్ తలపనేని తదితరులు హాజరై కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు.

ఈ సందర్భంగా రవి పొట్లూరి మాట్లాడుతూ, న్యూయార్క్లో ఇంత వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం ఆనందదాయకమని, తానా చరిత్రలో ఇది ఒక విశిష్టమైన కార్యక్రమంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ భర్తవరపు, ప్రసాద్ కోయి మరియు న్యూయార్క్ టీమ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
మహోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించగా, రిజిస్ట్రేషన్లు మరియు ఆర్థిక సహకారం అందించిన దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. నమోదు చేసుకోలేకపోయిన భక్తులు సైతం స్వామివారి దర్శనం, ఆశీర్వాదాలు పొందడంతో పాటు ప్రసాదం స్వీకరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణతో పాటు కమ్యూనిటీ బలోపేతమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ భర్తవరపు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ భర్తవరపు, ప్రసాద్ కోయిని తానా నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది.
కార్యక్రమ విజయానికి న్యూయార్క్ టీమ్ సభ్యులు దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ నాదెళ్ల, జితేంద్ర యార్లగడ్డ, ఉమా పోలిరెడ్డి, శ్రీనివాస్ పలాటి, ప్రదీప్ అరవేటి, రాజేష్ కడియాల, సునీల్ చల్లగుళ్ల, రవీంద్ర ఉప్పాల, సురేష్ మల్నీడి, కృష్ణకిషోర్ జమ్ముల, శ్రీహరి పర్ణ, కలీం మహమ్మద్, రాఘవేంద్ర మాదాల, విజయ్ కుమార్ లావు విశేషంగా కృషి చేశారు.
అలాగే తానా వాలంటీర్లు ఆశ్రిత కోయి, సమన్విత మిన్నెకంటి, గీతికా చల్ల, వరుణ్ భర్తవరపు, శరణ్ భర్తవరపు, రజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, శ్రీప్రియా శ్రీధర్, కావ్య మల్లేపల్లి, మజ్జి తులసీలక్ష్మి, శాన్వి కంకణాల అందించిన సేవలు కార్యక్రమ విజయానికి ప్రధాన కారణమయ్యాయి.
ప్రత్యేకంగా దైవ భక్తి గీతాలు ఆలపించిన ఆశ్రిత కోయి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టౌన్ ఆఫ్ నార్త్ హేంప్స్టీడ్ టౌన్ క్లర్క్ రాగిణి శ్రీవాస్తవ ప్రత్యేక అతిథిగా హాజరై తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ తానా న్యూయార్క్ టీమ్ తరఫున రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహోత్సవం ద్వారా తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు తానా మరోసారి తన నిబద్ధతను చాటిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
