
తెలంగాణ రాష్ట్రంలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. వైరస్ ను వ్యాప్తింపజేసే అవకాశమున్న సూపర్ స్ర్పడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండో డోస్ వ్యాక్సినేష్ ను మంగళవారం నుంచి ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.