
కరోనా, లాక్ డౌన్ కారణంగా రైళ్లలో ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మరో ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇందులో కాచిగూడ- విశాఖపట్నం, లింగపల్లి- విశాఖపట్నం రూట్లలో రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం -కాచిగూడ, విశాఖపట్నం – లింగపల్లి రైళ్లను ఈ నెల11 నుంచి 20 వరకు, కాచిగూడ- విశాఖపట్నం, లింగపల్లి- విశాఖపట్నం రైళ్లను ఈనెల 12నుంచి 21 వరకు క్యాన్సల్ చేసినట్లు వెల్లడించారు.