
కరోనా పరిస్థితుల్లో దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారికి హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారుకు 2 నెలలపాటు ఉచితంగా బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 88 లక్షల మందికి ఉచిత బియ్యం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.