
రాగల మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మచిలీపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్నదని, గుజరాత్ నుంచి కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితలద్రోణి ఆవరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.