Rahul Gandhi: గ్యాస్ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ విమర్శలు

దేశీయ వంటగ్యాస్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్రపై విమర్శలు గుప్పించారు. ప్రజలు పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఖాళీ కడుపుతో పడుకోబెట్టి.. తాను మాత్రం స్నేహితుల నీడలో హాయిగా నిద్రపోతున్నాడంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పెరిగిన సిలిండర్ల ధరల పట్టికను ట్యాగ్ చేశారు.

Written By: Velishala Suresh, Updated On : September 1, 2021 5:30 pm
Follow us on

దేశీయ వంటగ్యాస్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్రపై విమర్శలు గుప్పించారు. ప్రజలు పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఖాళీ కడుపుతో పడుకోబెట్టి.. తాను మాత్రం స్నేహితుల నీడలో హాయిగా నిద్రపోతున్నాడంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పెరిగిన సిలిండర్ల ధరల పట్టికను ట్యాగ్ చేశారు.