కోర్టు ధిక్కరణ కింద పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరి అనే ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. కోర్టుకు హాజరు కాలేదనే కారణంతో పూనం మాలకొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. తమను రెగ్యులరైజ్ చేయాలని సెరికల్చర్ ఉద్యోగులు.. గతంలో కోర్టుకు వెళ్లారు. దీంతో వారిని రెగ్యులరైజ్ చేయాలని.. గత ఏడాది ఫ్రిబ్రవరి 28న ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆర్డర్ ను అధికారులు సకాలంలో అమలు చేయలేదు. దీంతో ఐఏఎన్ అధికారులకు కోర్టు శిక్ష విధించింది. అయితే ఎంతకాలం శిక్ష విధిస్తారు అనే అంశంపై ఈనెల 29న ఖరారు చేయనుంది.