Amarajeevi Potti Sriramulu statue : అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించారు. ఇది నిర్వహించింది ప్రభుత్వం కాదు.. ఆర్యవైశ్య మెమోరియల్ ట్రస్ట్. వారు చేసింది తప్పు కాదు..కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర ఏర్పడడానికి మూల పురుషుడు. దేశానికి గాంధీ ఎలాగో.. ఆంధ్రాకు పొట్టి శ్రీరాములు అలాగా.. దీన్ని ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆంధ్ర పితను ఘనంగా మెమోరియల్ గా గుర్తించాల్సి ఉంది. ప్రభుత్వం కూడా పొట్టి శ్రీరాములును గుర్తించి ఆయన సేవలకు ఘనంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.
పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేయడం.. మరో 7 గురు ఆంధ్ర కోసం అసువులు బాయడంతోనే మద్రాసు ప్రావిన్సులో ఉన్న ఆంధ్రప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించారు. మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణమైన మహాపురుషుడికి ఆంధ్రప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? ఐకానిక్ ప్రదేశంగా ఒక ఎత్తైన ప్రదేశంగా భారీ విగ్రహం పెడితే చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేసి ఉండేది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినట్టు.. పొట్టి శ్రీరాములుకు గౌరవం ఇవ్వాలి.
విగ్రహావిష్కరణతో అమరజీవికి తగిన గుర్తింపు దక్కిందా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.