రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29 వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ ను వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ బమర్ జలీల్ ప్రకటించారు. జూన్ మొదటి వారంలో పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని గురువారం తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించే 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.