
పింఛనుదారులకు బ్యాంకుల నుంచి వాట్సప్ ద్వారా పింఛను చీటీలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖాతాల్లో పింఛను జమ అయిన వెంటనే సంబంధిత సమాచారాన్ని పింఛనుదారులకు చేరవేసేందుకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ లతో పాటు వాట్సప్ నూ వినియోగించుకోవచ్చునని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పింఛనుదారుల జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.