గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆచూకీ ఎట్టకేలకు లభించింది. భీమవరంలో ఆయనను రామగుండం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి రామగుండం తరలించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచి మధు గాయబ్ అయ్యారు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండగా పోలీసులు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది.