Paralympics: హైజంప్ లో భారత్ కు సిల్వర్

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల హైజంప్ లో ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. బంగారం పతకం కోసం జరిగిన ఫైనల్ లో గ్రేట్ బ్రిటన్ కు చెందిన జోనాథన్ ఎడ్ వర్డ్స్ 2.10 మీటర్ల ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జొనాథన్ బంగారు పతకం సాధించగా, ప్రవీణ్ కుమార్ 2.07 తో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక పోలాండ్ కు చెందిన […]

Written By: Suresh, Updated On : September 3, 2021 9:10 am
Follow us on

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల హైజంప్ లో ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. బంగారం పతకం కోసం జరిగిన ఫైనల్ లో గ్రేట్ బ్రిటన్ కు చెందిన జోనాథన్ ఎడ్ వర్డ్స్ 2.10 మీటర్ల ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జొనాథన్ బంగారు పతకం సాధించగా, ప్రవీణ్ కుమార్ 2.07 తో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక పోలాండ్ కు చెందిన మసీజ్ లెపియాటోకు బ్రోన్జ్ మెడల్ దక్కింది.