spot_img
Homeఎంటర్టైన్మెంట్Panjaa re release : 'పంజా' రీ రిలీజ్ థియేటర్స్ లో 'ఓజీ 2' టీజర్..?...

Panjaa re release : ‘పంజా’ రీ రిలీజ్ థియేటర్స్ లో ‘ఓజీ 2’ టీజర్..? ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్..

Panjaa re release : పవన్ కళ్యాణ్ అభిమానులకు మళ్లీ మంచి రోజులు మొదలైనట్టుగానే అనిపిస్తోంది. ‘ఓజీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నుండి విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 100 కోట్ల గ్రాస్ ని క్లోజింగ్ లో అందుకోవడానికి ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చింది. మొదటి రోజుకి 150 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన పవన్ కళ్యాణ్ కి , క్లోజింగ్ లో 100 కోట్ల గ్రాస్ రావడానికి కష్టం అయ్యిందంటే అభిమానులకు ఎంతటి అవమానం అనేది అర్థం చేసుకోవచ్చు. అంతటి అవమానం తర్వాత ఫ్యాన్స్ కూడా ఇక సినిమాల విషయం లో లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనాపరంగా ఫుల్ బిజీ అవ్వడం , ఈ బిజీ లో ఆయన తదుపరి చిత్రం ఏంటో కూడా క్లారిటీ లేకపోవడమే.

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ‘ఓజీ 2’ నే అని , ఈ ఏడాది నవంబర్ నుండే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు అవుతుందని , పవన్ కళ్యాణ్ ఈసారి సుజిత్ కోరినన్ని డేట్స్, భారీ విదేశీ షెడ్యూల్స్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అధికారికంగా టీం నుండి ఖరారు అవ్వడం తో , అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ‘ఓజీ 2’ గురించే చర్చ. లోకల్ మీడియా నుండి ఇంటర్నేషనల్ మీడియా వరకు ఈ సినిమా పై ఆర్టికల్స్ రాయడం వంటివి , చర్చించుకోవడం వంటివి అభిమానులకు చెప్పలేని ఆనందాన్ని కలిగించాయి. ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా , ఓజీ 2 కి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా తెలుపనున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఇదే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ చిత్రం గా నిల్చిన ‘పంజా ‘ రీ రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయ్యింది కానీ, నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో మాత్రం సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. సెప్టెంబర్ 2 న ‘ఓజీ 2’ టీజర్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో , కచ్చితంగా ‘పంజా’ చిత్రానికి ఆ టీజర్ ని అటాచ్ చేస్తారనే ఆశలో ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఒకవేళ ఇదే జరిగితే ‘పంజా’ రీ రిలీజ్ మొదటి రోజే 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular