Pakistan Occupied Kashmir : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్.. దీన్ని ఆక్రమించిన పాకిస్తాన్ .. దీన్ని ‘అజాద్ కశ్మీర్’గా పిలుస్తారు. అక్టోబర్ 24, 1947లో ఏర్పడింది. గిల్గిట్ బాల్టిస్టాన్, అజాద్ కశ్మీర్ ను పాక్ ఆక్రమించింది. ఇది 77 ఏళ్లుగా పాకిస్తాన్ కాలనీగా ఉంది. పేరుకు స్వతంత్ర ప్రాంతం.. కానీ పాకిస్తాన్ పాలనలోనే మగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వారు భారత్ లో జమ్మూకశ్మీర్ ఎలా మారుతుందో చూస్తున్నారు.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు కశ్మీర్ లో పరిస్థితులు మారాయి. ఐఐటీలు, ఐఐఎంలు లాంటి 10 అత్యున్నత సంస్థలు వచ్చాయి. రోడ్లు, మౌళిక వసతులు, బాగా వచ్చాయి. భారత్ ఏమో శత్రుదేశంగా చూస్తే కశ్మీరీలకు భారత్ వల్లే మేలు జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రం అక్కడ నష్టం జరిగిందని ఇతర దేశాల్లో ఉన్న కశ్మీరీలు గ్రహించి ఇప్పుడు పీఓకే లో ఆందోళనలు చేపడుతున్నారు.
ఒకనాడు కేవలం ఆర్థిక డిమాండ్ల వరకే ఉన్నాయి. గత 10 రోజుల ఆందోళనలో ఈరోజు రాజకీయ డిమాండ్ గా మారింది. మా కశ్మీర్ లో మీరు ఎవరు అంటూ పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. మీ పాక్ సైన్యం ఇక్కడ ఎందుకు అంటూ నినదిస్తున్నారు.
పాక్ ఆర్మీ, పాక్ అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు చేస్తున్నాడు. ఆడవారు, వేలాది మంది పబ్లిక్ ర్యాలీలు తీస్తున్నారు. మా దేశం వేరు.. మీది వేరు అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఉగ్రవాదానికి ఊతం ఇచ్చి పెంచి పోషించిందే పాక్ ఆక్రమిత కశ్మీర్. కానీ ఇవ్వాల హిందుస్తాన్ తో అయినా కలుస్తాం అని అంటున్నారు.
పాకిస్తాన్ గో బ్యాక్ నినాదాలతో మార్మోగుతున్న ఆక్రమిత కాశ్మీర్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

