Coronavirus: విశాఖలో గత నెలలో నమోదైన కొవిడ్ కేసులకు సంబంధించిన నమూనాలను పుణెలోని ఎన్ ఐవీలో పరీక్షించగా ఒమిక్రాన్ వేరియంట్ గా తేలింది. విశాఖ కేజీహెచ్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో కొవిడ్ 19 కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే.. చాలా వరకు రికార్డు ల్లో నమోదవడం లేదు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను రోజుకు వెయ్యి వరకు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది.