India vs England: ఇండియన్ టీమ్ పై ఇక నోటికి పని చెప్పం.. జో రూట్

టీమింటియాను మాటలతో కవ్విస్తే ఏం జరుగుతుందో ఇంగ్లాండ్ టీమ్ కు స్పష్టంగా తెలిసిపోయింది. ఆ మ్యాచ్ లో అనూహ్యంగా 151 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండ్ ఇప్పుడు తన పొరపాట్లపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఇక తమ ఆటగాళ్లు నోటికి పని చెప్పబోరని ఆ టీమ్ కెప్టెన్ జో రూట్ చెప్పాడు. బుధవారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రూట్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. టీమిండియా ఎలాగైనా ఆడనీ.. మేము మాత్రం మా ఉత్తమమైన […]

Written By: Suresh, Updated On : August 24, 2021 11:39 am
Follow us on

టీమింటియాను మాటలతో కవ్విస్తే ఏం జరుగుతుందో ఇంగ్లాండ్ టీమ్ కు స్పష్టంగా తెలిసిపోయింది. ఆ మ్యాచ్ లో అనూహ్యంగా 151 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండ్ ఇప్పుడు తన పొరపాట్లపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఇక తమ ఆటగాళ్లు నోటికి పని చెప్పబోరని ఆ టీమ్ కెప్టెన్ జో రూట్ చెప్పాడు. బుధవారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రూట్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. టీమిండియా ఎలాగైనా ఆడనీ.. మేము మాత్రం మా ఉత్తమమైన ఆటతీరు కనబరచడానికి ప్రయత్నిస్తాం. నోటికి పని చెప్పే కంటే మా టీమ్ ఆటపై దృష్టి పెడుతుంది. ఆట నుంచి దృష్టి మరల్చే దేనినీ పట్టించుకోవాలనుకోవడం లేదు అని రూట్ అన్నాడు.