ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బుధవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. రఘురామ ఆరోగ్యం కోలుకోవడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం బేగం పేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీలో బయల్దేరి వెళ్లారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు రఘురామను అరెస్టు చేసి గుంటూరుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే తనను సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ […]

Written By: Suresh, Updated On : May 26, 2021 12:17 pm
Follow us on

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బుధవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. రఘురామ ఆరోగ్యం కోలుకోవడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం బేగం పేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీలో బయల్దేరి వెళ్లారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు రఘురామను అరెస్టు చేసి గుంటూరుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే తనను సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ ఎంపీ నేరుగా సుప్రీంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.