రాష్ట్రంలో వ్యవసాయ సలహా కమిటీలను క్రియాశీలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వారికి అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రాప్ ప్లానింగ్ మొదలుకొని, అన్ని అంశాల్లో వీరు రైతులకు పూర్తిగా అండగా ఉండాలన్నారు. ఈ మహత్తర ప్రక్రియలోమహిళలను కూడా భాగస్వాములు చేయాలని సూచించారు.