గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఖాజ టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారీని క్యాష్ కౌంటర్ వద్ద ఆపి టోల్ రుసుము చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే మంటలు క్యాష్ కౌంటర్లకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన టోల్ ప్లాజా సిబ్బంది అక్కడి నుంచి పరుగుల తీశారు. లారీ డ్రైవర్ కూడా వాహనం నుంచి కిందకు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు టోల్ గేట్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.