గోవాలో లాక్ డౌన్ పొడిగింపు
కరోనా కట్టడికి అమల్లో లాక్ డౌన్ ను మే 31 వరకూ పొడిగించినట్లు గోవా ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. కేబినెట్ భేటీ అనంతరం గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ ను మే 31 వరకూ కొనసాగించాలని నిర్ణయించామన్నారు. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు, లిక్కర్ షాపులు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. రెస్టారెంట్ కిచెన్లు, మందుల షాపులు ఉదయం ఏడు నుంచి […]
Written By:
, Updated On : May 21, 2021 / 03:59 PM IST

కరోనా కట్టడికి అమల్లో లాక్ డౌన్ ను మే 31 వరకూ పొడిగించినట్లు గోవా ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. కేబినెట్ భేటీ అనంతరం గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ ను మే 31 వరకూ కొనసాగించాలని నిర్ణయించామన్నారు. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు, లిక్కర్ షాపులు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. రెస్టారెంట్ కిచెన్లు, మందుల షాపులు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ అనుమతిస్తారు.