కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని.. మాణికం ఠాగూర్ డబ్బులు తీసుకొని సీనియర్లను కాదని రేవంత్ కు పీసీసీ కట్టబెట్టారని కౌశిక్ రెడ్డి నిన్న జరిగిన మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నిరాధార ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించాయని మాణికం ఠాగూర్ నోటీసుల్లో పేర్కొన్నారు.