Konaseema: ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. శుభకార్యానికి వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతు అయ్యారు. ముగ్గురు బయటకు వచ్చారు. గల్లంతైన వారు క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, రోహిత్, లు గా గుర్తించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.