తెలంగాణ జన సమితి పని విధానాన్ని పార్టీ కమిటీలో సమీక్షించుకున్నాం. ప్రజా సంఘాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాం, పార్టీ నిర్మాణ లోపాలను గుర్తించి బలోపేతం అవుతామని కోదండరాం అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అమరువీరుల ఆశయ సాధనకు తెజస కృషి చేస్తోందన్నారు. పైసలు కుమ్మరించి గెలవాలన్నదే తెరాస తాపత్రయం అని విమర్శించారు. ఆగస్టులో పార్టీ ప్లీనరీ నిర్వహించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.