సింగాపూర్లో కనిపించిన కోవిడ్ కొత్త వేరియెంట్ మన దేశంలో ఈ మహమ్మారి మూడో ప్రభంజనంగా మారవచ్చునని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కొత్త వేరియంట్ చిన్న పిల్లలకు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. తక్షణమే సింగపూర్ నుంచి వైమానకి సేవలను నిలిపి వేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వన్ని కోరారు. బాలలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సింగాపూర్ లో కనిపించిన కొత్త రకం కరోనా వల్ల పిల్లలకు తీవ్రమైన అపాయం జరుగుతుందని చెప్తున్నారని పేర్కొన్నారు.