spot_img
Homeటాప్ స్టోరీస్temple politics Telangana : ఆధ్యాత్మిక వార్: వైష్ణవ 'గులాబీ' వర్సెస్ శైవ 'హస్తం'...

temple politics Telangana : ఆధ్యాత్మిక వార్: వైష్ణవ ‘గులాబీ’ వర్సెస్ శైవ ‘హస్తం’…

వైష్ణవ దేవాలయాలకు కేసీఆర్ పెద్దపీట
శివాలయాలకు సీఎం రేవంత్ ప్రాధాన్యత
కేసీఆర్ వదిలేసిన వాటికి రేవంత్ నిధులు
తెలంగాణలో రంజుగా భక్తి ఫైట్!

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఏ లెవల్‌కు వెళ్లాయంటే.. రేపు పొద్దున ఓటర్లు కూడా ఓటు వేసే ముందు ఏ దేవుడిని నమ్ముతున్నారో చూసుకుని బటన్ నొక్కాల్సి వస్తుందేమో! గత పదేళ్లుగా మన రాష్ట్రాన్ని ఏలిన “వైష్ణవ ప్రియుడు” కేసీఆర్ గారు యాదాద్రిలో నరసింహస్వామిని కోట్లు ఖర్చు పెట్టి కోవెల కట్టిస్తే.. ఇప్పుడు వచ్చిన మన “శివ భక్త” రేవంత్ రెడ్డి గారు మాత్రం “మీరు చక్రం తిప్పితే.. నేను త్రిశూలం తిప్పుతా” అంటూ శైవ నామాలతో రంగంలోకి దిగారు.

రాజకీయం… భక్తి ముసుగులో!

ఇన్నాళ్లూ కేసీఆర్ గారు చినజీయర్ స్వామి సూచనలతో, ఆగమ శాస్త్రాల లెక్కలతో.. ఎక్కడ చూసినా ‘గోవిందా గోవిందా’ అనిపించారు. కానీ భద్రాచలం రామయ్యను మాత్రం ఎందుకో కాస్త లైట్ తీసుకున్నారు. అక్కడే మన రేవంత్ అన్నకు రూట్ దొరికింది. “కేసీఆర్ గారు రాముడిని మర్చిపోతే.. నేను రాముడికి పట్టువస్త్రాలు ఇస్తూనే, శివుడితో సెల్ఫీలు దిగుతా” అన్నట్లుగా ఆయన ప్లాన్ మార్చేశారు.

రాహుల్ మార్క్ శైవం.. రేవంత్ మార్క్ శివం!

ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు “నేను శివ భక్తుడిని” అని ఫోజులు ఇస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ లైన్ గట్టిగా పట్టేశారు. కేసీఆర్ వేములవాడ రాజన్నకు రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పి ‘సారీ.. మర్చిపోయా’ అంటే.. రేవంత్ రెడ్డి గారు మాత్రం “రాజన్నకు నిధులిస్తా.. మూసీ గట్టున వంద అడుగుల శివుడిని నిలబెడతా” అని శివతాండవం చేస్తున్నారు. మొత్తానికి పాత పాలనలో ‘విష్ణువు’ హైలైట్ అయితే కొత్త పాలనలో ‘పరమశివుడు’ ట్రెండింగ్‌లో ఉన్నారన్నమాట!

దేవుళ్ల మధ్య పోటీయా? నాయకుల మధ్య పోటీయా?

అసలు ఇక్కడ డౌట్ ఏంటంటే.. వీరికి భక్తి పెరిగిందా? లేక దేవుళ్లని కూడా విభజించి ఓట్లు దండుకోవాలని ఉందా? కేసీఆర్ మార్క్ భారీ గోపురాలు, శిల్ప కళలు, వైష్ణవ ఆడంబరం కనిపిస్తోంది. ఇక రేవంత్ మార్క్ సాదాసీదా శివ భక్తి, శైవ క్షేత్రాల డెవలప్‌మెంట్, ‘జై భోలో’ నినాదాలు వినిపిస్తున్నాయి.

ఒకరు గాలిలో చక్రం తిప్పాలని చూస్తే, మరొకరు నిప్పు కన్ను తెరుస్తానని హింట్లు ఇస్తున్నారు. కానీ పాపం జనం మాత్రం.. “అయ్యా.. మీరు వైష్ణవమో, శైవమో మాకు అనవసరం.. మాకు కొంచెం వర్షాలు కురిపించి, రోడ్లు వేయించి, మా బతుకులు బాగు చేస్తే ఏ దేవుడైనా ఒక్కటే!” అని ముక్కున వేలేసుకుంటున్నారు.

రాజకీయ నాయకుల భక్తి ఎప్పుడూ ‘సీజనల్’ వ్యాధి లాంటిదే. ఎన్నికలప్పుడు గుళ్లు తిరగడం కామన్, కానీ ఇలా ‘శాఖల’ వారీగా దేవుళ్లను పంచుకోవడం మాత్రం విచిత్రం. కేసీఆర్ గారు వైష్ణవంతో ‘మోక్షం’ పొందాలనుకుంటే, రేవంత్ రెడ్డి గారు శైవంతో ‘శక్తి’ని ప్రదర్శిస్తున్నారు. రేపు ఇంకెవరైనా వచ్చి “మేము శాక్తేయులం” అని అమ్మవారిని పట్టుకొస్తారో ఏమో!

చివరికి ఏ దేవుడు కరుణిస్తాడో కానీ.. తెలంగాణ ఓటర్లు మాత్రం ఈ “ఆధ్యాత్మిక వార్” చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version