ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. మ్యాచ్ లు మొత్తం ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు హోరాహోరీగా ప్రదర్శన చేస్తున్నారు. గోల్స్ మీద గోల్స్ నమోదవుతున్నాయి. దీంతో అభిమానులకు కావాల్సినంత ఫుట్ బాల్ మజా లభిస్తోంది. ప్రతి మ్యాచ్ కు ప్రేక్షకులు భారీగా హాజరవుతున్నారు. పోటీపోటీగా తమ జట్టు ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నారు. ఆయాజట్లకు సంబంధించిన జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ ఉత్సాహంగా సాగుతున్న నేపథ్యంలో కెనడా మాజీ ప్రధాని ట్రూడో అడ్డంగా దొరికిపోయాడు. సోషల్ మీడియాలో అతడి గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. పైగా సోషల్ మీడియాలో తనదేశానికి సంబంధించిన జెండాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తన మీద వస్తున్న విమర్శలకు సరైన స్థాయిలో సమాధానం చెబుతున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లో అమెరికా, పరాగ్వే తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అమెరికా నాలుగు గోల్స్ చేసింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో అమెరికా చేసిన గోల్సే అధికం. ట్రూడో అమెరికా పరాగ్వే మ్యాచ్ కు హాజరయ్యాడు. అతడు ఒక్కడు మాత్రమే కాకుండా ప్రేయసి పెర్రీతో కలిసి హాజరయ్యాడు. అమెరికా పరాగ్వే మ్యాచ్ చూశాడు. అమెరికా ప్లేయర్లు గోల్స్ కొడుతుంటూ చప్పట్లు కొడుతూ సందడి చేశాడు. అతడి పక్కన కేటీ ఫెర్రీ కూడా ఉంది.
కెనడా మాజీ ప్రధాని అమెరికా మ్యాచ్ కు హాజరుకావడం పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.దీనిపై ట్రూడో వివరణ ఇచ్చాడు. ‘కొన్ని సార్లు ఇలాంటి విషయాలలో అడ్డంగా దొరికి పోక తప్పదు. సపోర్టివ్ బాయ్ ఫ్రెండ్ పాత్ర పోషించాల్సి వస్తుంది. నేను ఎవరికి మద్దతు ఇస్తాను?, ఎవరు గెలవాలని కోరుకుంటాను? మీకు తెలుసు’ అంటూ ట్రూడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాదు, కెనడా జాతీయ జెండా ఏమోజీని కూడా దానికి జత చేశాడు. ట్రూడో, ఫెర్రీ కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారు. కాగా, బోస్నియాతో జరిగిన మ్యాచ్ ను కెనడా డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ లో కెనడా ఒక్క గోల్ చేసింది. ఫిఫా కప్ ను కెనడా, అమెరికా, మెక్సికో నిర్వహిస్తున్నాయి.

