spot_img
Homeఆధ్యాత్మికంJaladhivasa Ganapati : నిండా నీళ్లు.. రంధ్రం నుంచే దర్శనం.. మనదేశంలో ఏకైక జలాధివాస గణపతి...

Jaladhivasa Ganapati : నిండా నీళ్లు.. రంధ్రం నుంచే దర్శనం.. మనదేశంలో ఏకైక జలాధివాస గణపతి ఎక్కడ కొలువై ఉన్నాడో తెలుసా?

Jaladhivasa Ganapati : వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు పండగ వాతావరణం నెలకొంటుంది. ఒక ప్రాంతంలో ఒక విధంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. విగ్నేశ్వరుడికి ఘనంగా పూజలు చేసి.. తమ భక్తిని నిరూపించుకుంటారు. భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలను శోభాయమానంగా జరుపుకుంటారు.

మనదేశంలో విభిన్న రూపాలలో గణపతులు దర్శనమిస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఎంతో ప్రాశస్త్యం ఉన్న గణపతి ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది జలాధి వాస గణపతి ఆలయం విశేషమైన గుర్తింపు పొందింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మంగళూరు నగరం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనెగుడ్డి ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. అనె అంటే ఏనుగు అని.. గుడ్డి అంటే కొండ అని అర్థం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు తీవ్రస్థాయిలో కరువు ఏర్పడింది. వర్షాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ప్రజల సమస్యను గుర్తించిన అగస్త్య మహర్షి యాగం చేశారు. ఈ సమయంలో కుంభాసురుడు అనే రాక్షసుడు యాగానికి ఆటంకం కలిగించాడు. ఆ రాక్షసుడిని సంహరించడానికి పాండవుల తరఫున భీమసేనుడు వినాయకుడికి పూజలు చేశాడు. భీమసేనుడి పూజలు మెచ్చిన వినాయకుడు రాక్షసుడు ని చంపడానికి ఆయుధాన్ని ప్రసాదించాడు.. ఆ ఆయుధం ద్వారా భీమసేనుడు రాక్షసుడిని సంహరించాడు. ఈ ప్రాంతానికి కుంభాషి అనే పేరు కూడా ఉంది. కుంభాషురుడు అనే రాక్షసుడు పేరు మీదనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.

మూడు అడుగుల ఎత్తులో..

ఈ ఆలయంలో గణపతి కేవలం మూడు అడుగులు ఎత్తు మాత్రమే ఉంటాడు. స్వామివారి చుట్టూ నల్లటి శిల్పం ఉంటుంది. వినాయకుడి మెడవరకు నిత్యం నీరు కనిపిస్తూనే ఉంటుంది. చిన్నపాటి రంధ్రం ఎదురుగా ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. విగ్రహం కూడా సగం వరకు నీటిలోనే ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ గణపతిని జలాధి వాస గణపతి అని అంటున్నారు. ఇక్కడ భక్తులు స్వామివారిని సర్వసిద్ధి ప్రదాయక వాసన రాకపోతే అని భావిస్తుంటారు.. ఈ ఆలయం ఉడిపి జిల్లాలోని కుందాపుర పట్టణానికి పరిధిలో ఉంటుంది. మనదేశంలో ఏకైక జలాధివాస గణపతి ఆలయంగా ఈ క్షేత్రం పేరు తెచ్చుకుంది. కేవలం రాతి నుంచి ఈ విగ్రహం ఉద్భవించిందని చరిత్రకారుడు నమ్ముతుంటారు.. కుందాపుర రైల్వే స్టేషన్ కు వరకు వెళ్లి.. ఆ తర్వాత ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. లేదా మంగళూరు విమానాశ్రయంలో దిగి.. అక్కడి నుంచి ప్రత్యేకమైన వాహనాల ద్వారా కుందాపుర ప్రాంతానికి వెళ్లొచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Oktelugu Epaper
Exit mobile version