IND vs PAK : టి20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో భారత మహిళలు ఆదివారం పోటీ పడబోతున్నారు. ఈ మ్యాచ్లో భారత జట్టు మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళల క్రికెట్లో పాకిస్తాన్ జట్టు భారతదేశం తో ఏ మాత్రం పోటీ పడలేదు. రికార్డులు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. కానీ సంచలన ఆట తీరుకు పాకిస్తాన్ పెట్టింది పేరు. ఆ జట్టు ఈ క్షణంలో ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. అందువల్లే హర్మన్ సేన ఏమాత్రం నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు ఆదిలోనే బ్రేక్ వేయాలి. బౌలర్లను ఒక ఆట ఆడుకోవాలి. అలా అయితేనే భారత్ లో ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది.
కొద్దిరోజులుగా భారత మహిళల జట్టు ఇంగ్లాండ్లోనే ఉంటున్నది. టి20 వరల్డ్ కప్ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టుతో భారత మహిళలు టి20 టోర్నీ ఆడారు. ఆ టోర్నీలో ఏమాత్రం సత్తా చూపించలేకపోయారు. ఇంగ్లాండ్ మైదానాల ముందు భారత మహిళలు తేలిపోయారు. ముఖ్యంగా స్మృతి.. హర్మన్.. రిచా.. జమీమాంటివారు తమ స్థాయిలో ఆడలేకపోయారు. ఈ నేపథ్యంలో జరిగే మ్యాచ్లో వీరు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్లో కాస్త మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ.. టి20 వరల్డ్ కప్ సాధించాలంటే ఇది సరిపోదు.
పాకిస్తాన్ జట్టుతో భారత్ ఆడిన మ్యాచ్లను ఒకసారి పరిశీలిస్తే.. టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు పాకిస్తాన్, భారత్ 8 సార్లు తలపడ్డాయి.. ఇందులో భారత్ ఆరుసార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ రెండుసార్లు విషయాలు అందుకుంది. మొత్తం టి20 లలో భారత్, పాకిస్తాన్ 16 సార్లు పోటీపడ్డాయి. ఇందులో భారత్ 13 సార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ మూడుసార్లు గెలుపును సొంతం చేసుకుంది.
మొత్తంగా చూస్తే భారత జట్టుది పై చేయి లాగా కనిపిస్తున్నప్పటికీ.. పాకిస్తాన్ జట్టును అంత సులభంగా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఆ జట్టు ప్లేయర్లు ఎప్పుడు ఎలా ఆడతారు ఎవరికి తెలియదు. పైగా భారత్ అంటే పాకిస్తాన్ ప్లేయర్లు రెచ్చిపోతారు. కొన్ని సందర్భాలలో అనితర సాధ్యమైన అటుతీరుతో ఆకట్టుకుంటారు. అలాంటప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లకు భారత్ ప్లేయర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. భారత జట్టులో శపాలి, స్మృతి, యస్తిక, జమీమా, రిచా, క్రాంతి, దీప్తి, శ్రీ చరణి వంటి వారు ఉన్నారు.. ఇంగ్లాండ్ గడ్డమీద వీరు సత్తా చూపిస్తే టీమిండియా కు అడ్డు అనేది ఉండదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఈ మ్యాచ్ సాయంత్రం 7:00 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అవుతుంది.

