దళితులు, మహిళలు మంత్రులైతే కొందరికి నచ్చడంలేదు..

లోక్ సభలో ఇవాళ ప్రధాని మోదీ తన మంత్రిమండలిని పరిచయం చేశారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే ప్రధాని మోదీ మాట్లాడారు. దేశానికి చెందిన దళితులు, మహిళలు, ఓబీసీలు మంత్రులు అయితే, ప్రతిపక్షాలకు సంతోషంగా లేదని ఆయన అన్నారు. పార్లమెంట్ లో ఉత్సాహ వాతావరణం ఉంటుందని అనుకున్నానని, కొత్త మహిళా, దళితా ఎంపీలను స్వాగతిస్తున్నామని, కానీ కొందరికి మాత్రం దళిత ఎంపీలు మంత్రులు కావడం నచ్చడం […]

Written By: Suresh, Updated On : July 19, 2021 12:14 pm
Follow us on

లోక్ సభలో ఇవాళ ప్రధాని మోదీ తన మంత్రిమండలిని పరిచయం చేశారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే ప్రధాని మోదీ మాట్లాడారు. దేశానికి చెందిన దళితులు, మహిళలు, ఓబీసీలు మంత్రులు అయితే, ప్రతిపక్షాలకు సంతోషంగా లేదని ఆయన అన్నారు. పార్లమెంట్ లో ఉత్సాహ వాతావరణం ఉంటుందని అనుకున్నానని, కొత్త మహిళా, దళితా ఎంపీలను స్వాగతిస్తున్నామని, కానీ కొందరికి మాత్రం దళిత ఎంపీలు మంత్రులు కావడం నచ్చడం లేదని ఆరోపించారు.