
9 వ విడత పీఎం కిసన్ నిధులను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా సుమారు రూ. 19,500 కోట్ల మొత్తాన్ని రైతుల అకౌంట్లోకి క్రెడిట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ అమౌంటన్ ను రిలీజ్ చేశారు. సుమారు 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధి వెళ్తుంది. ఆగస్టు- నవంబర్ పీరియడ్ కు సంబంధించిన అమౌంట్ ను రిలీజ్ చేశారు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రైతులు తమ వివరాలను తెలుసుకోవచ్చు.