నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని బిజినేపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీకుమారుడు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. మృతులను వట్టెం గ్రామానికి చెందిన బాలయ్య గౌడ్ (65), శివకుమార్ గౌడ్ (35) గా పోలీసులు గుర్తించారు.