
ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఘోర ఘటన చోటు చేసుకున్నది. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో 25 మంది సైనికులు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ధ్రేవీకరించారు. బెర్బర్స్ పర్వతం, కబైలీ ప్రాంతంలో మంటలు వ్యాపించగా సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి ట్వీట్ చేసింది. మంటలను అదుపు చేస్తున్న క్రమంలో నలుగురు సైనికులు తీవ్రగాయాలకు గురయ్యారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.