
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపునకు యత్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.