
విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడివలసలో దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడిన భర్త తన ఇద్దరు ఆడపిల్లలను నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా ఐదేళ్ల పాపకు తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు ప్రసాద్ ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.