
పెద్దపల్లి జిల్లాలోని జూలప్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్ కు చెందిన లచ్చయ్య, మహేశ్ తండ్రీ కొడుకులు. కొంతకాలం క్రితం మహేశ్ మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మహేశ్ తండ్రి లచ్చయ్యను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. కాగా హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.