జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో గొల్లపల్లి మండలం మల్లనపేట వాగులో చిక్కుకొని నందిపల్లికి చెందిన తండ్రీకుమారుడు గల్లంతయ్యారు. వంతెనపై నుంచి వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు.