Disha Encounter Case: కొనసాగుతోన్న సిర్పూర్కర్ కమిషన్ విచారణ

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సురేందర్ రెడ్డిని కమిషన్ సభ్యులు విచారిస్తున్నారు. నిన్న కూడా సురేందర్ రెడ్డిని కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. ఎన్ కౌంటర్ కు సంబంధించి సిట్ నివేదికలో పొందుపర్చిన అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 26, 27, 28 తేదీల్లోనూ సురేందర్ రెడ్డిని కమిషన్ విచారించింది. ఇవాళ సురేందర్ రెడ్డి విచారణ ముగిస్తే మరికొంత మంది […]

Written By: Suresh, Updated On : September 2, 2021 4:06 pm
Follow us on

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సురేందర్ రెడ్డిని కమిషన్ సభ్యులు విచారిస్తున్నారు. నిన్న కూడా సురేందర్ రెడ్డిని కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. ఎన్ కౌంటర్ కు సంబంధించి సిట్ నివేదికలో పొందుపర్చిన అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 26, 27, 28 తేదీల్లోనూ సురేందర్ రెడ్డిని కమిషన్ విచారించింది. ఇవాళ సురేందర్ రెడ్డి విచారణ ముగిస్తే మరికొంత మంది పోలీస్ అధికారులను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది.