
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 39,486 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,35,110 గా ఉంది. వ్యాక్సినేషన్ రిపోర్ట్ ను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 58,89 కోట్ల మందికి కోవిడ్ టీకాలు వేశారు.