శ్రీలంక టూర్ లో ఉన్న ఇండియన్ టీమ్ లో కరోనా కలకలం రేపింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లు ఐసోలేషన్ లో ఉన్నాయి. ఒకవేళ టీమ్స్ లోని అందరూ ప్లేయర్స్ నెగటివ్ గా తేలితే బుధవారం ఈ రెండో టీ20 నిర్వహిస్తారు.