శ్రీలంక ఆటగాళ్లకు కరోనా నెగిటివ్

టీమ్ ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో శ్రీలంక జట్టు ఆటగాళ్లందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా తేలిందని ఆ బోర్డు వెల్లడించింది. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ప్లవర్ తో పాటు డేటా అనలిస్టు నీరోషన్ కు గతవారం కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆ బోర్డు అధికారి ఒకరు […]

Written By: Suresh, Updated On : July 11, 2021 5:33 pm
Follow us on

టీమ్ ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో శ్రీలంక జట్టు ఆటగాళ్లందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా తేలిందని ఆ బోర్డు వెల్లడించింది. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ప్లవర్ తో పాటు డేటా అనలిస్టు నీరోషన్ కు గతవారం కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. దాంతో సోమవారం వారిని బయోబుడగలోకి అనుమతించే అవకాశం ఉందన్నారు.