Kerala Menstrual Leave Policy: ఎంతసేపటికి పదవుల కోసం.. కాంట్రాక్టుల కోసం.. కమిషన్ల కోసమే పాకులాడుతుంటారు. నిత్యం పంచాయతీలు పెట్టుకుంటారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటారు. దుమ్మెత్తి పోసుకుంటారు. పదవుల విషయంలో రాజకీయాలు చేస్తుంటారు. పైరవీలు కొనసాగిస్తుంటారు.. ఇదిగో ఇలాంటి ప్రచారమే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీడియాలో.. సోషల్ మీడియాలో సాగుతూ ఉంటుంది.
అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జనం కోణంలో ఆలోచిస్తుంటారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి నిర్ణయం ఇది. ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కచ్చితంగా అభినందించాలి.. భుజం తట్టి శభాష్ అని పొగడాలి.. ఇంతకీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి.. ప్రజల జీవితాల్లో ఎలా మార్పు తీసుకొస్తుంది.. ఇంతకీ ఆ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి..
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సతీషన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వాస్తవానికి వేణుగోపాల్ కు ఆ పదవి రావాలి. కాకపోతే అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఆ పదవి ఇచ్చారు. సతీషన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేరళ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కౌమార అమ్మాయిలకు ప్రతినెలా మూడు రోజులపాటు రుతుక్రమ సెలవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కార్యాలయాలలో క్వాలిటీ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు అమలు చేయబోతున్నారు. అంతేకాదు పేదరికం తొలగించేందుకు.. అనాధలు లేని రాష్ట్రంగా మార్చేందుకు దత్తతలను ప్రోత్సహించబోతున్నారు. వాస్తవానికి ఇటువంటి నిర్ణయాలు గొప్పగా ఉండకపోవచ్చు. కానీ చాలామందిని ప్రభావితం చేస్తాయి.
ఆడవాళ్లకు ఆ మూడు రోజులు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వారిలో రకరకాల సమస్యలు ఉంటాయి. అవి బయటకు చెప్పుకోలేరు. కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మహిళా ఉద్యోగులు నరకం చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిని గమనించి సెలవులు ప్రకటించడం
.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇది త్వరగా అమలులోకి వచ్చి.. కేరళ అమ్మాయిలకు, మహిళలకు రిలీఫ్ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
