కోవిడ్ వ్యాక్సిన్ ధర విషయంలో కేంద్ర వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. వ్యాక్సిన్ ధర విషయంలో అన్ని రాష్ట్రాలు కలిసి ధరల చర్చల కమిటీ ని ఏర్పాటు చేసుకొని ఒకే ధర నిర్ణయించుకుంటే బాగుటుందని ట్విట్టర్ వేదికగా చిదంబరం సలహా ఇచ్చారు. కేంద్రం ఇంతటి క్లిష్ట సమయంలో తన బాధ్యతలను విస్మరించి వ్యాక్సిన్ విషయంలో కార్పొరేట్ సంస్థల ముందు మోకరిల్లిందని మండిపడ్డారు.