కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చార్ ధామ్ యాత్రపై పడింది. కేసులు పెరిగిపోతుండడంతో యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కుంభమేళాపై విమర్శలు వెల్లువెత్తినా చార్ ధామ్ యాత్రనూ నిర్వహించి తీరుతామని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ప్రకటించారు. అయితే కరోనా తీవ్రత వల్ల తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.