కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ తెదేపా జాతీయా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై విజయవాడ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గతేడాది తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా పరామర్శ కోసం లోకేశ్ సూర్యారావుపేట కోర్టు సెంటర్ కి వెళ్లారు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.