మాజీ మంత్రి దేవినేని ఉమపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు దేవినేని ఉప పై కేసు నమోదు చేశారు. ఈనెల 16న మైలవరంలోని అయ్యప్ప నగర్ లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ పరిశీలించారు. తన వెంట ఎక్కువ మంది జనాలను తీసుకొని వెళ్లి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు అభియోగం మోపుతూ పోలీసులు కేసు నమోదు చేశారు.