
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటి అనుమతిండంలేదు.