కల్లు కోసం ఘర్షణ.. దారుణ హత్య

మద్యం మత్తులో కల్లుకోసం  ఇరువురు స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం హత్యకు దారితీసింది. మియాపూర్ ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం కర్టాటక రాష్ట్రం బీదర్ సమీపం హోలికేడ్ గ్రామానికి చెందిన ఫరీద్ (44) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి హఫీజ్ పేట ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా డీసీఎం డ్రైవర్ గా పనిచేసే ఫరీద్ సోమవారం రాత్రి ఆటోడ్రైవర్ మహబూబ్ తో కలిసి మద్యం తాగేందుకు ప్రేమ్ నగర్ సమీపంలోని ఓ […]

Written By: Suresh, Updated On : June 15, 2021 8:16 am
Follow us on

మద్యం మత్తులో కల్లుకోసం  ఇరువురు స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం హత్యకు దారితీసింది. మియాపూర్ ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం కర్టాటక రాష్ట్రం బీదర్ సమీపం హోలికేడ్ గ్రామానికి చెందిన ఫరీద్ (44) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి హఫీజ్ పేట ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా డీసీఎం డ్రైవర్ గా పనిచేసే ఫరీద్ సోమవారం రాత్రి ఆటోడ్రైవర్ మహబూబ్ తో కలిసి మద్యం తాగేందుకు ప్రేమ్ నగర్ సమీపంలోని ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లాడు. అక్కడే మహబూబ్, ఫరీద్ కు మద్య కల్లు తెచ్చే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ రాయితో ఫరీద్ ను తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.